చిత్రం: ఈనాటి ఈ బంధం ఏనాటిదో (1977) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: ఎం. బాలయ్య నేపధ్య గానం: సుశీల పల్లవి: ఎవరికి చెప్పేది? ఏమని చెప్పేది? నేనెవరికి చెప్పేది మనసిప్పేమని చెప్పేది హోరున వీచే గాలికా.. చిరుగాలికా.. ఉరకలు వేసే నీటికా.. సెలయేటికా.. ఎవరికి చెప్పేది? ఏమని చెప్పేది? చరణం 1: నీటిలోని కలువను నేను.. నింగినేలే జాబిలి తాను నీటిలోని కలువను నేను.. నింగినేలే జాబిలి తాను నన్నే తలచి మదిలో వలచి నన్నే తలచి మదిలో వలచి దివి నుండి తానె దిగి రాగా ఆ ఆ ఆ... కలవరపరచే కమ్మని తలపులు.. ఇవి.. ఇవి.. అని ఎవరికి చెప్పేది? ఏమని చెప్పేది? చరణం 2: మల్లె తీగలు పందిరి కోసం ఎదిగెదిగి ఎగబాకిన చందం మల్లె తీగలు పందిరి కోసం ఎదిగెదిగి ఎగబాకిన చందం పొందు కోరి పొంచిన పరువం పొందు కోరి పొంచిన పరువం నచ్చిన వానిని పెనేసుకోదా.. ఆ ఆ ఆ.. ఉప్పెనలా వచ్చే ఊహలు ఇవి.. ఇవి.. అని ఎవరికి చెప్పేది? ఏమని చెప్పేది? నేనెవరికి చెప్పేది మనసిప్పేమని చెప్పేది హోరున వీచే గాలికా చిరుగాలికా ఉరకలు వేసే నీటికా సెలయేటికా.. లాల లలల లలాలల లాల లలల లలాలల | |
Sunday, August 26, 2012
ఎవరికి చెప్పేది.. ఏమని చెప్పేది
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment