Sunday, August 26, 2012

ఎవరికి చెప్పేది.. ఏమని చెప్పేది

చిత్రం: ఈనాటి ఈ బంధం ఏనాటిదో (1977)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: ఎం. బాలయ్య
నేపధ్య గానం: సుశీల

పల్లవి:

ఎవరికి చెప్పేది? ఏమని చెప్పేది?
నేనెవరికి చెప్పేది మనసిప్పేమని చెప్పేది
హోరున వీచే గాలికా.. చిరుగాలికా..
ఉరకలు వేసే నీటికా.. సెలయేటికా..
ఎవరికి చెప్పేది? ఏమని చెప్పేది?

చరణం 1:

నీటిలోని కలువను నేను.. నింగినేలే జాబిలి తాను
నీటిలోని కలువను నేను.. నింగినేలే జాబిలి తాను
నన్నే తలచి మదిలో వలచి
నన్నే తలచి మదిలో వలచి
దివి నుండి తానె దిగి రాగా ఆ ఆ ఆ...
కలవరపరచే కమ్మని తలపులు.. ఇవి.. ఇవి..
అని ఎవరికి చెప్పేది? ఏమని చెప్పేది?

చరణం 2:

మల్లె తీగలు పందిరి కోసం ఎదిగెదిగి ఎగబాకిన చందం
మల్లె తీగలు పందిరి కోసం ఎదిగెదిగి ఎగబాకిన చందం
పొందు కోరి పొంచిన పరువం
పొందు కోరి పొంచిన పరువం
నచ్చిన వానిని పెనేసుకోదా.. ఆ ఆ ఆ..
ఉప్పెనలా వచ్చే ఊహలు ఇవి.. ఇవి..
అని ఎవరికి చెప్పేది? ఏమని చెప్పేది?
నేనెవరికి చెప్పేది మనసిప్పేమని చెప్పేది
హోరున వీచే గాలికా చిరుగాలికా
ఉరకలు వేసే నీటికా సెలయేటికా..
లాల లలల లలాలల
లాల లలల లలాలల

No comments:

Post a Comment