చిత్రం : పూల రంగడు (1967)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం : కె. బి. మోహన్ రాజు, సుశీల
పల్లవి:
చిగురులు వేసిన కలలన్ని.. సిగలో పూలుగ మారినవి
మనసున పొంగిన అలలన్నీ..
మమతల తీరం చేరినవి.. మమతల తీరంచేరినవి..
ఆ.ఆ.ఓ...ఓ...ఓ
చరణం 1:
సన్నజాజి తీగలాగ నిన్ను చేరుకున్నానూ..ఊ..
సన్నజాజి తీగలాగ నిన్ను చేరుకున్నాను
నిండు మనసు పందిరి కాగా ...
నిన్ను అందుకున్నాను.. నిన్నే అందుకున్నాను...
చిగురులు వేసిన కలలన్ని.. సిగలో పూలుగ మారినవి
చరణం 2:
దాగలేని రాగాలేవో దాచినావు ఆనాడు
దాగలేని రాగాలేవో దాచినావు ఆనాడు
నా తనువు అణువణువు..
నీదే నీదే ఈనాడు.. నీదే నీదే ఏనాడు...
చిగురులు వేసిన కలలన్ని.. సిగలో పూలుగ మారినవి
చరణం 3:
నీటిలోని కలువను కోరి నింగి దిగిన జాబిలి నీవే..ఏ..
నీటిలోని కలువను కోరి నింగి దిగిన జాబిలి నీవే
పరిమళాల తరగలలోనే..ఏ...ఆ ఆ ఆ...
పరిమళాల తరగలలోనే...
కరిగించిన చెలియవు నీవే.. కరగించిన చెలియవు నీవే
చిగురులు వేసిన కలలన్ని.. సిగలో పూలుగ మారినవి
మనసున పొంగిన అలలన్నీ..
మమతల తీరం చేరినవి.. మమతల తీరంచేరినవి..
ఆ.ఆ.ఓ...ఓ...ఓ
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2305
No comments:
Post a Comment