Wednesday, October 30, 2013

చిగురులు వేసిన కలలన్ని



చిత్రం :  పూల రంగడు (1967)
సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత :  దాశరథి
నేపధ్య గానం :  కె. బి. మోహన్ రాజు, సుశీల

పల్లవి:

చిగురులు వేసిన కలలన్ని.. సిగలో పూలుగ మారినవి
మనసున పొంగిన అలలన్నీ.. 
మమతల తీరం చేరినవి.. మమతల తీరంచేరినవి..
ఆ.ఆ.ఓ...ఓ...ఓ

చరణం 1:

సన్నజాజి తీగలాగ నిన్ను చేరుకున్నానూ..ఊ..
సన్నజాజి తీగలాగ నిన్ను చేరుకున్నాను
నిండు మనసు పందిరి కాగా ...
నిన్ను అందుకున్నాను.. నిన్నే అందుకున్నాను...

చిగురులు వేసిన కలలన్ని.. సిగలో పూలుగ మారినవి

చరణం 2:

దాగలేని రాగాలేవో దాచినావు ఆనాడు
దాగలేని రాగాలేవో దాచినావు ఆనాడు
నా తనువు అణువణువు.. 
నీదే నీదే ఈనాడు.. నీదే నీదే ఏనాడు...

చిగురులు వేసిన కలలన్ని.. సిగలో పూలుగ మారినవి

చరణం 3:

నీటిలోని కలువను కోరి నింగి దిగిన జాబిలి నీవే..ఏ..
నీటిలోని కలువను కోరి నింగి దిగిన జాబిలి నీవే
పరిమళాల తరగలలోనే..ఏ...ఆ ఆ ఆ...
పరిమళాల తరగలలోనే...
కరిగించిన చెలియవు నీవే.. కరగించిన చెలియవు నీవే

చిగురులు వేసిన కలలన్ని.. సిగలో పూలుగ మారినవి
మనసున పొంగిన అలలన్నీ.. 
మమతల తీరం చేరినవి.. మమతల తీరంచేరినవి..
ఆ.ఆ.ఓ...ఓ...ఓ

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2305

No comments:

Post a Comment