Sunday, May 11, 2014

నా మాటే నీ మాటై చదవాలీ

చిత్రం :  మట్టిలో మాణిక్యం (1971)
సంగీతం : సత్యం
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  బాలు, సుశీల


పల్లవి:


నా మాటే నీ మాటై చదవాలీ
నేనంటే నువ్వంటూ రాయాలీ
నా మాటే నీ మాటై చదవాలీ
నేనంటే నువ్వంటూ రాయాలీ


అఆ.. ఇఈ.. ఉఊ.. ఎఏ
అఆ.. ఇఈ.. ఉఊ.. ఎఏ


చరణం 1:


మట్టిలో రాసిన రాతలు గాలికి కొట్టుకుపోతే ఎట్లాగా.. ఎట్లాగా..
మనసున రాసీ మననం చేస్తే జీవితమంతా ఉంటాయి.. నిలిచుంటాయి..


ఆ మాటే నిజమైతే నేర్పమ్మా .. మనసంతా రాసేస్తా కోకమ్మ


నా మాటే నీ మాటై చదవాలీ
నేనంటే నువ్వంటూ రాయాలీ


పడవ.. కడవ
చిలక.. పలక


చరణం 2:


ఆహా .. ఆహా .. ఓహో ..ఓహో..
కొండలు కోనలు ఏం చదివాయి
కో అంటే అవి కో అంటాయి


హృదయన్నుండి కదిలాయంటే.. 

చదువులు చదవకే వస్తాయి.. బదులిస్తాయి
ఆ చదువే నేనింకా చదవాలి.. ఆ బదులే నీ నుంచి రావాలి...


నా మాటే నీ మాటై చదవాలీ
నేనంటే నువ్వంటూ రాయాలీ
అహహా హా హా హా హా
ఆఆ ఆ ఆ ఆ ఆ
ఒహొహో హో హో హో
ఆఆ ఆ ఆ ఆ ఆ 

No comments:

Post a Comment