చిత్రం : మల్లీశ్వరి (1951) సంగీతం : ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత : దేవులపల్లి నేపధ్య గానం : ఘంటసాల, భానుమతి
పల్లవి:
ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు దేశ దేశాలన్ని తిరిగి చూసేవు ఏడ తానున్నాడో బావా.. ఏడ తానున్నాడో బావా.. జాడ తెలిసిన పోయిరావా ఆ ఆ ఆ అందాల ఓ మేఘమాలా ఆ ఆ ఆ చందాల ఓ మేఘమాలా..
గగనసీమల తేలు ఓ మేఘమాల మా ఊరు గుడి పైన మసలి వస్తున్నావా.. మల్లి మాటేదైన నాతో మనసు చల్లగా చెప్పి పోవా ఆ... నీలాల ఓ మేఘమాల ఆ.. రాగాల ఓ మేఘమాల
చరణం 1:
మమతలెరిగిన మేఘమాలా నా..మనసు బావకు చెప్పిరావా ఎన్నాళ్ళు నాకళ్ళు దిగులుతో రేపవలు ఎన్నాళ్ళు నాకళ్ళు దిగులుతో రేపవలు ఎదురు తెన్నులు చూచేనే బావకై చెదరి కాయలు కాచెనే ఏ ఏ ఏ
నీలాల ఓ మేఘమాలా ఆ.. రాగాలా ఓ మేఘమాలా
చరణం 2:
మనసు తెలిసిన మేఘమాలా ఆ ఆ.. మరువలేనని చెప్పలేవా మల్లితో మరువలేనని చెప్పలేవా కళ్ళు తెరచినగాని కళ్లు మూసినగాని కళ్ళు తెరచినగాని కళ్లు మూసినగాని మల్లి రూపే నిలిచేనే నా చెంత మల్లి మాటే పిలిచెనే
No comments:
Post a Comment