చిత్రం : మల్లెపువ్వు (1978) సంగీతం : చక్రవర్తి నేపధ్య గానం : బాలు
పల్లవి:
ఎవ్వరో ఎవ్వరో....
ఎవ్వరో ఎవ్వరో ఈ నేరాలడిగేవారెవ్వరో ఈ పాపం కడిగే దిక్కెవ్వరో ఎవ్వరో వారెవ్వరో...
అందెలు సందడి చేసిన జాతరలో.. ఆకలేసి ఏడ్చిన పసికందులు అందం అంగడికెక్కిన సందులలో.. అంగలార్చి ఆడిన రాబందులు ఎందుకో ఈ చిందులు... ఎవరికో ఈ విందులు ఏమిటో ఏమిటో ఏ ధర్మం ఇది న్యాయం అంటుందో
ఏ కర్మం ఈ గాయం చేసిందో? ఏమిటో.. ఆ ధర్మం ఏమిటో?
చరణం 1:
శీలానికి శిలువలు.. కామానికి కొలువులు కన్నీటి కలువలు.. ఈ చెలువలు కదులుతున్న ఈ శవాలు.. రగులుతున్న శ్మశానాలు మదమెక్కిన మతితప్పిన.. నరజాతికి నందనాలు ఎప్పుడో ఎప్పుడో ఈ జాతికి మోక్షం ఇంకెప్పుడో ఈ గాధలు ముగిసేదింకెన్నడో? ఎన్నడో? మోక్షం ఇంకెప్పుడో?
చరణం 2:
అత్తరు చల్లిన నెత్తురు జలతారులలో మైల పడిన మల్లెలు ఈ నవ్వులు కుక్కలు చింపిన విస్తరి తీరులలో ముక్కలైన బ్రతుకులు ఈ పూవులు ఎందరికో ఈ కౌగిళ్ళు.. ఎన్నాళ్ళో ఈ కన్నీళ్ళు ఎక్కడా ఎక్కడా ఏ వేదం ఇది ఘోరం అన్నదో ఏ వాదం ఇది నేరం అన్నదో? ఎక్కడో? ఆ వేదం ఎక్కడో?
చరణం 3:
ఈ మల్లెల దుకాణాలు.. ఈ గానాబజానాలు వెదజల్లిన కాగితాలు.. వెలకట్టిన జీవితాలు.. వల్లకాటి వసంతాలు.. చస్తున్నా స్వాగతాలు కట్లు తెగిన దాహాలకు.. తూట్లు పడిన దేహాలు ఎక్కడో? ఎక్కడో? ఈ రాధల బృందావనమెక్కడో? ఈ బాధకు వేణుగానం ఎన్నడో?
No comments:
Post a Comment