Thursday, June 12, 2014

మనసున మల్లెల మాలలూగెనే

చిత్రం :  మల్లీశ్వరి (1951)
సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత :  దేవులపల్లి
నేపధ్య గానం :  భానుమతి 



పల్లవి:

ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. 

మనసున మల్లెల మాలలూగెనే
కన్నుల వెన్నెల డోలలూగెనే


ఎంతహాయి యీ రేయి నిండెనో
ఎంతహాయి యీ రేయి నిండెనో
ఎన్నినాళ్లకీ బతుకు పండెనో


చరణం 1:


కొమ్మల గువ్వలు గుసగుసమనినా
రెమ్మల గాలులు ఉసురుసురనినా
అలలు కొలనులో గలగలమనినా
అలలు కొలనులో గలగలమనినా


దవ్వుల వేణువు సవ్వడి వినినా
దవ్వుల వేణువు సవ్వడి వినినా


నీవు వచ్చేవని నీ పిలుపే విని

నీవు వచ్చేవని నీ పిలుపే విని

కన్నుల నీరిడి కలయజూచితిని


గడియ యేని యిక విడిచిపోకుమా
గడియ యేని యిక విడిచిపోకుమా
ఎగసిన హృదయము పగులనీకుమా


ఎన్నినాళ్లకీ బతుకు పండెనో
ఎంత హాయి యీ రేయి నిండెనో

No comments:

Post a Comment