Wednesday, July 2, 2014

బాలనురా మదనా

చిత్రం :  మిస్సమ్మ (1955)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత :  పింగళి
నేపధ్య గానం :  సుశీల


పల్లవి:


బాలనురా... మదనా...
బాలనురా... మదనా...
విరి తూపులు వేయకురా... మదనా...
బాలను రా... మదనా...



చరణం 1:


నిలచిన చోటనే నిలువగ నీయక ఆ..
నిలచిన చోటనే నిలువగ నీయక
వలపులు కురియును రా
తీయని తలపులు విరియును రా..  మదనా


బాలనురా... మదనా...
విరి తూపులు వేయకురా... మదనా...
బాలను రా... మదనా..


చరణం 2:


చిలుకల వలే గోర్వంకల వలెనో ఓ..
చిలుకల వలే గోర్వంకల వలెనో
కులుకగ తోచును రా...
తనువున పులకలు కలుగును రా... మదనా...


బాలనురా... మదనా...
విరి తూపులు వేయకురా... మదనా...
బాలను రా... మదనా..



చరణం 3:


చిలిపి కోయిలలు చిత్తములో నే..ఏ..ఏ
చిలిపి కోయిలలు చిత్తములో నే
కలకల కూయును రా
మనసును కలవర పరచును రా.. మదనా


బాలనురా... మదనా...
విరి తూపులు వేయకురా... మదనా...
బాలను రా... మదనా..

No comments:

Post a Comment