Saturday, August 16, 2014

నడిరేయి ఏ జాములో

చిత్రం :  రంగులరాట్నం (1966)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత :  దాశరథి
నేపధ్య గానం :  ఘంటసాల,  జానకి 



పల్లవి :


నడిరేయి ఏ జాములో.. స్వామి నిను చేర దిగివచ్చునో
తిరుమల శిఖరాలు దిగివచ్చునూ...


నడిరేయి ఏ జాములో.. స్వామి నిను చేర దిగివచ్చునో
తిరుమల శిఖరాలు దిగివచ్చునూ 


చరణం 1 :


మముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ
మముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ
పతి దేవు ఒడిలోన మురిసేటివేళా


స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిసేటివేళా
విభునికి మా మాట వినిపించవమ్మా
ప్రభువుకు మా మనవి వినిపించవమ్మా 


చరణం 2 :


ఏడెడు శిఖరాలు నే నడువలేను .. ఏ పాటి కానుకలందించలేను
వెంకన్న పాదాలు దర్శించలేను... నేను వివరించి నా బాధ వినిపించలేను


అమ్మా..ఆ..ఆ..ఆ.. మము గన్న మాయమ్మా అలివేలుమంగా
మము గన్న మాయమ్మా అలివేలుమంగా
విభునికి మా మాట వినిపించవమ్మా
ప్రభువుకు మా మనవి వినిపించవమ్మా 


చరణం 3 :


కలవారినేగాని కరుణించలేడా..  నిరుపేద మొరలేవి వినిపించుకోడా
కన్నీటి బ్రతుకుల కనలేనినాడు.. స్వామి కరుణామయుండన్నా బిరుదేలనమ్మా
అడగవే మా తల్లి అనురాగ వల్లి .. అడగవె మాయమ్మ అలివేలుమంగా


నడిరేయి ఏ జాములో..  స్వామి నిను చేర దిగివచ్చునో
తిరుమల శిఖరాలు దిగివచ్చునూ...


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=8225

No comments:

Post a Comment