చిత్రం : రంగులరాట్నం (1966)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం : ఘంటసాల, జానకి
పల్లవి :
నడిరేయి ఏ జాములో.. స్వామి నిను చేర దిగివచ్చునో
తిరుమల శిఖరాలు దిగివచ్చునూ...
నడిరేయి ఏ జాములో.. స్వామి నిను చేర దిగివచ్చునో
తిరుమల శిఖరాలు దిగివచ్చునూ
చరణం 1 :
మముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ
మముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ
పతి దేవు ఒడిలోన మురిసేటివేళా
స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిసేటివేళా
విభునికి మా మాట వినిపించవమ్మా
ప్రభువుకు మా మనవి వినిపించవమ్మా
చరణం 2 :
ఏడెడు శిఖరాలు నే నడువలేను .. ఏ పాటి కానుకలందించలేను
వెంకన్న పాదాలు దర్శించలేను... నేను వివరించి నా బాధ వినిపించలేను
అమ్మా..ఆ..ఆ..ఆ.. మము గన్న మాయమ్మా అలివేలుమంగా
మము గన్న మాయమ్మా అలివేలుమంగా
విభునికి మా మాట వినిపించవమ్మా
ప్రభువుకు మా మనవి వినిపించవమ్మా
చరణం 3 :
కలవారినేగాని కరుణించలేడా.. నిరుపేద మొరలేవి వినిపించుకోడా
కన్నీటి బ్రతుకుల కనలేనినాడు.. స్వామి కరుణామయుండన్నా బిరుదేలనమ్మా
అడగవే మా తల్లి అనురాగ వల్లి .. అడగవె మాయమ్మ అలివేలుమంగా
నడిరేయి ఏ జాములో.. స్వామి నిను చేర దిగివచ్చునో
తిరుమల శిఖరాలు దిగివచ్చునూ...
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=8225
No comments:
Post a Comment