Monday, January 19, 2015

రారయ్యా పోయిన వాళ్ళు

చిత్రం :  గాజుల కిష్టయ్య (1975)
సంగీతం :  కె. వి. మహదేవన్
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  సుశీల 



పల్లవి :


రారయ్యా పోయిన వాళ్ళు.. ఎవరయ్యా ఉండే వాళ్ళు
నవ్వు మరచి...  నన్ను మరచి..
ఎందుకు కన్నీళ్లు.. ఇలా ఎన్నాళ్ళు


రారయ్యా పోయిన వాళ్ళు.. ఎవరయ్యా ఉండే వాళ్ళు
నవ్వు మరచి...  నన్ను మరచి..
ఎందుకు కన్నీళ్లు.. ఇలా ఎన్నాళ్ళు


రారయ్యా పోయిన వాళ్ళు



చరణం 1 :


తొలిసారి చూశాను నీ కళ్ళను.. అవి చిలికాయి నవ్వుల వెన్నెల్లను
తొలిసారి చూశాను నీ కళ్ళను.. అవి చిలికాయి నవ్వుల వెన్నెల్లను


నిలువునా పులకించాను..  కలువనై విరబూచాను
మసకేసిన చందమామను.. ఏమని చూస్తాను.. నేనేమైపోతాను


రారయ్యా పోయిన వాళ్ళు



చరణం 2 : 


నీ కళ్ళకే కాదు కన్నీళ్ళకూ నే తోడు వుంటాను ఏ వేళకూ
నీ మమతనే కాదు నీ కలతనూ.. నే పంచుకుంటాను ప్రతి జన్మకూ
నీ మమతనే కాదు నీ కలతనూ.. నే పంచుకుంటాను ప్రతి జన్మకూ


రారయ్యా పోయిన వాళ్ళు 



చరణం 3 : 



నిదురల్లె వస్తాను నీ కంటికి చిరునవ్వు తెస్తాను నీ పెదవికి
నిదురల్లె వస్తాను నీ కంటికి చిరునవ్వు తెస్తాను నీ పెదవికి
అమ్మల్లె లాలించి అనురాగం పలికించి మళ్ళీ నిను మనిషిని చేస్తా
అన్నీ మరిపించి.. నిన్నే నవ్వించి 

రారయ్యా పోయిన వాళ్ళు




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3082

No comments:

Post a Comment