చిత్రం : నాకూ స్వతంత్రం వచ్చింది (1975)
సంగీతం : సత్యం
గీతరచయిత : మైలవరపు గోపి
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
హైలో హైలో హైలో... హైలో..
హైలో హైలో హైలో... హైలో
హైయ్యా హైయ్యా...హైయ్యా హైయ్యా
ఎంకీ నే సూడలేనే..ఎలుతురులో నీ రూపు
ఎలిగి పోతుంటేనూ..ఆహా ఆహా ఓహో ఓహో మ్మ్ మ్మ్
ఈ ఎలుగు నీదేనురా.. ఊపిరి ఉండేదాకా
ఈ జనమ కడదాకా..ఆహా ఆహా ఆహా ఆహా ఆహా
హైలో హైలో హైలో హైలో..హైలో హైలో హైలో హైలో
సైయ్య సైయ్య...సైయ్య సైయ్య
చరణం 1 :
ఏ యేళా సిగపూలై.. ఎన్నంటీ నేనుండనా
పొదలోనీ పూవల్లే నీ వొడిలో దాగనా
ఎదపైన రవ్వంత చోటిస్తే...
ఈ ఎలుగు నీదేనురా.. ఊపిరి ఉండేదాకా
ఈ జనమ కడదాకా..ఆహా ఆహా ఓహో ఓహో మ్మ్ మ్మ్
చరణం 2 :
ఎన్నెల్లో సంద్రంలా.. నా మనసూ పొంగితే
సంద్రంలో కెరటాలై.. కోరికలే తరిమితే
ఊరిస్తూ ఉడికిస్తూ... నీ ఉంటే
ఎంకీ నే సూడలేనే..ఎలుతురులో నీ రూపు
ఎలిగి పోతుంటేనూ..ఆహా ఆహా ఆహా ఆహా ఆహా
చరణం 3 :
నీ పైనా మనసంతా.. ఈ పొద్దే తీరనీ
రేతిరినీ కౌగిలినీ.. ఈ తీరే నిలవనీ
వలపంతా చిలికిస్తూ దరికొస్తే
ఎంకీ నే సూడలేనే..ఎలుతురులో నీ రూపు
ఎలిగి పోతుంటేనూ..ఆహా ఆహా ఆహా అహా అహా ఓహో ఓహో
ఈ ఎలుగు నీదేనురా..ఊపిరి ఉండేదాకా
ఈ జనమ కడదాకా..ఆహా ఆహా ఆహా ఆహా ఆహా
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4012
No comments:
Post a Comment