చిత్రం : గడుసు పిల్లోడు (1985)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : సుశీల
పల్లవి :
అనకు... ఆ మాట మాత్రం అనకు
అనకు... ఆ మాట మాత్రం అనకు
ఇది ఆఖరి మాటని అనకు
నీ మనసు మూసి వేశాననకు
నా మాట మరచిపోతాననకు
అనకు... ఆ మాట మాత్రం అనకు
ఇది ఆఖరి మాటని అనకు
చరణం 1 :
నా కళ్ళలోనీ నీ రూపము... కరిగేది కాదు కన్నీళ్లకు
నా కళ్ళలోనీ నీ రూపము... కరిగేది కాదు కన్నీళ్లకు
నీ గుండెలోనీ నా గానము... మాసేది కాదు మరచేందుకు
కాదనకు... లేదనకు... కథ మార్చి పొమ్మనకు
అనకు... ఆ మాట మాత్రం అనకు
ఇది ఆఖరి మాటని అనకు
చరణం 2 :
ప్రేమ పువ్వుల బాటనుకోకు... పిరికివాడివై బాట మార్చకు
ప్రేమ పువ్వుల బాటనుకోకు... పిరికివాడివై బాట మార్చకు
మనసు మిగిలితే చాలును మనకు...
మమతే గురుతది ఉన్నందుకు...
ఉన్నానూ.. నీ కొరకు.. ఉంటాను కడవరకు
అనకు... ఆ మాట మాత్రం అనకు
ఇది ఆఖరి మాటని అనకు
నీ మనసు మూసి వేశాననకు
నా మాట మరచిపోతాననకు
అనకు... ఆ మాట మాత్రం అనకు
ఇది... ఆఖరి మాటని అనకు
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2049
No comments:
Post a Comment