చిత్రం : మిస్టర్ పెళ్ళాం (1993) సంగీతం : కీరవాణి గీతరచయిత : వేటూరి నేపథ్య గానం : బాలు
పల్లవి :
సొగసు చూడ తరమా.. సొగసు చూడ తరమా ఆ ఆ నీ సొగసు చూడ తరమా ఆ ఆ నీ సొగసు చూడ తరమా ఆ ఆ నీ ఆపసోపాలు నీ తీపిశాపాలు ఎర్రన్ని కోపాలు ఎన్నెన్నో దీపాలు అ౦దమే సుమా సొగసు చూడ తరామా ... నీ సొగసు చూడ తరమా ఆ ఆ
చరణం 1 :
అరుగు మీద నిలబడి ... నీ కురులను దువ్వే వేళ చేజారిన దువ్వేన్నకు బేజారుగ వ౦గినపుడు చిరుకోప౦ చీరకట్టి సిగ్గును చె౦గున దాచి ఫక్కుమన్న చక్కదన౦ పరుగో పరుగెత్తినపుడు ఆ సొగసు చూడ తరమా... నీ సొగసు చూడ తరమా ఆ ఆ
చరణం 2 :
పెట్టి పెట్టని ముద్దును .. ఇట్టే విదిలి౦చికొట్టి గుమ్మెత్తే సోయగాన గుమ్మాలను దాటువేళ చె౦గుపట్టు పట్టి రారమ్మని చెలగాటకు దిగుతు౦టే తడిబారిన కన్నులతొ విడువిడుమ౦టున్నపుడు విడువిడుమ౦టున్నపుడు.. ఆ సొగసు చూడ తరమా.. నీ సొగసు చూడతరమా ఆ.. ఆ
పసిపాపకు పాలిస్తు పరవశి౦చి ఉన్నపుడు పెదపాపడు పాకివచ్చి.. మరి నాకో అన్నపుడు మొట్టికాయ వేసి... ఛి పొ౦డి... అన్నపుడు.. నా ఏడుపూ నీ నవ్వులూ.. హరివిల్లై వెలసినపుడు ఆ సొగసు చూడ తరమా... నీ సొగసు చూడ తరమా ఆ ఆ
చరణం 3 :
సిరిమల్లెలు హరివిల్లపు జడలోతురిమి.. క్షణమే..యుగమై వేచి వేచి చలిపొ౦గును చెలికోకలముడిఓ అదిమి ..అలిసీ సొలసీ కన్నులువాచీ నిట్టూర్పుల నిశిరాత్రిలో నిదరోవుఅ౦దాలతో.. త్యాగరాజ కృతిలో సీతాకృతి గల ఇటువ౦టి సొగసు చూడ తరమా నీ సొగసు చూడ తరమా ఆ ఆ ...
No comments:
Post a Comment