చిత్రం : రాధాకృష్ణ (1978)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత :
నేపథ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
ఏప్పుడో....
అప్పుడెప్పుడెప్పుడెప్పుడో చూశాను... నిన్నేనా జాంపండు
నువ్వేనా నా జాంపండు... నువ్వేనా ఆ జాంపండు
ఇప్పుడే....
ఇప్పుడిప్పుడిప్పుడిప్పుడే చూస్తున్న... నువ్వేనా మొద్దబ్బాయి
నువ్వేనా ఆ మొద్దబ్బాయి... నువ్వేనా నా మొద్దబ్బాయి
చరణం 1 :
కొలను నేనుంటే కలువపూలు కోస్తుంటే
చేరుకోబోయినప్పుడు నువ్వు జారినప్పుడు... ఆ జారినప్పుడు...
నిన్ను ఎలా ఎత్తుకొన్నానో గుర్తుందా... గుర్తుందా..
అరటిపండు పట్టుకొని ఆలయంలో నువ్వుంటే..
గండుకోతి పండును కాజేసినప్పుడు... కాజేసినప్పుడు
నువ్వెలా అదిరిపోయావో గుర్తుందా... గుర్తుందా..
అన్నీ గుర్తేకాని అమ్మడూ.. ఆ...
చిట్టి అమ్మడూ... ఉహు...
ఈ వంపులేడ దాచావో అప్పుడు..హా..హా....
ఇప్పుడిప్పుడిప్పుడిప్పుడే చూస్తున్న నువ్వే నా మొద్దబ్బాయి... హా
నువ్వేనా ఆ మొద్దబ్బాయీ... నువ్వేనా ఆ జాంపండు
చరణం 2 :
బడికి నువ్వు రానంటే మెడపట్టి ఈడ్చుకొస్తే
పంతులయ్య బరితపూజ చేసినప్పుడు... ఆ చేసినప్పుడు...
నువ్వెలా తుర్రుమన్నావో గుర్తుందా... గుర్తుందా..
నువ్వు తినే జాంపండు నేను కాస్త లాక్కోని
ఉరిస్తు ఊరిస్తు తినేటప్పుడు... ఆ తినేటప్పుడూ..
నువ్వెలా మొహం పెట్టవో గుర్తుందా... ఆ... గుర్తుందా..
అన్నీ గుర్తే కాని కృష్ణుడు..చిన్ని కృష్ణుడు..
ఆ చిలిపితనం పోలేదే ఇప్పుడు...హా...
అప్పుడెప్పుడెప్పుడెప్పుడో చూశాను నిన్నేనా జాంపండు
నువ్వేనా నా జాంపండు... నువ్వే నా ఆ మొద్దబ్బాయి
ఆ..నువ్వే నా నా జాంపండు... నువ్వే నా నా మొద్దబ్బాయి
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=2537
No comments:
Post a Comment